మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం

నాగాలాండ్‌కు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు

మేఘాలయా అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు

త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు

మార్చి 2వ తేదీన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రకటన : సీఈసీ రాజీవ్‌ కుమార్‌

న్యూఢిల్లీ,

2023లో తొలి భాగంలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది . ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మేఘాలయా, త్రిపురలకు ఎన్నికల తేదీలను ఖరారు చేసింది. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నాగాలాండ్‌కు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.వీటిలో 59 స్థానాలు ఎస్టీ కేటాయింపు కాగా ..ఒకటి జనర్ కేటగిరికి కేటాయించినట్లు సీఈసీ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

ఇక 12 జిల్లాలతో 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మేఘాలయా అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. 55 స్థానాలు ఎస్టీ, జనరల్‌ కోటాలో 5 అసెంబ్లీ స్థానాలు కేటాచించారు. ఎనిమిది జిల్లాలు, 60 స్థానాలు ఉన్న త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక్కడ 30 జనరల్‌, 10 ఎస్సీ ,20 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 180 స్థానాలకు జరగబోయే ఎన్నికల కోసం 9,125 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. మార్చి 2వ తేదీన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *