తెలంగాణ రాష్ట్రం స్పోర్ట్స్ హబ్గా మారింది :రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్,క్రీడా,పర్యాటక, సాంస్కృతిక,వారసత్వ శాఖల మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్
తెలంగాణ స్పోర్ట్స్ హబ్గా మారిందని రాష్ట్ర ప్రొహిబిషన్ ,ఎక్సైజ్,క్రీడా,పర్యాటక,సాంస్కృతిక,వారసత్వ శాఖల మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు .హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి రెండో తేదీ నుంచి 5 వ తేదీ వరకు జరగనున్న ఐదవ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ 2023 వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.

ఈ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 15 వేల మంది మాస్టర్స్ ఆథ్లెట్ లు పాల్గొననున్నట్లు నిర్వహణ కమిటీ ఛైర్మన్ కొలన్ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. 18 రకాల క్రీడలు, 27 రాష్ట్రాల నుంచి మాస్టర్స్ క్రీడాకారులు వస్తున్నారని తెలిపారు. ఈ గేమ్స్ అంతర్జాతీయ స్థాయిలో 4 రోజుల పాటు జరుగుతున్న ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ను నిర్వహిస్తున్న నిర్వహకులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ ఛైర్మన్ కొలన్ జగదీశ్వర్ రెడ్డి, కార్యదర్శి రామారావు , ఉపాధ్యక్షులు అనూప్ చక్రవర్తి, ఉపాధ్యక్షుడు/ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఓర్సు రమేష్ లు పాల్గొన్నారు.