విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలి: సీఎం జగన్

అమ‌రావ‌తి

జూన్‌ నాటికి విద్యావిధాన సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలన్నారు. ఎస్‌సీఈఆర్‌టీ సిఫారసులన్నీ అమల్లోకి రావాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన జగన్.. సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండాలన్నారు. కొత్త విద్యావిధానం వల్ల 22 వేల మంది టీచర్లకు పదోన్నతి కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వటంతో పాటు పదోన్నతులు, బదిలీలు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్‌ నాటికి విద్యావిధాన సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్నారు. ప్రతి మండలంలో 2 హైస్కూళ్లు, 2 కాలేజీలు ఉండాలని సూచించారు. ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్​ కౌన్సిల్​ ఆఫ్​ ఎడ్యుకేషనల్​ రీసెర్చ్​ అండ్​ ట్రైనింగ్​) సిఫారసులన్నీ అమల్లోకి రావాలని అధికారులను ఆదేశించారు. రీసోర్స్‌ సెంటర్‌ను మండల విద్యాశాఖాధికారి కార్యాలయంగా మార్పులు చేస్తూ.. ఎండీవో పరిధిలో కాకుండా ఎంఈవోకే డ్రాయింగ్‌ అధికారాలు ఇవ్వాలన్నారు. ఈ మేరకు అధికారులను ఎంఈవోకే అప్పగిస్తూ ఎస్‌సీఈఆర్‌టీ చేసిన సిఫారసుకు సీఎం ఆమోదం తెలిపారు. ఎంఈవో పోస్టుల భర్తీకి సీఎం జగన్ అంగీకారం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *