శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లు ఈనెల 9న విడుదల

తిరుమల : శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్ల ను జనవరి 9న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.

జనవరి 12 నుంచి 31 వరకు, ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300ల టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు భక్తులు ఆన్‌లైన్‌ లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని తెలిపింది. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ఏకాదశి టికెట్లు జారీ చేయడంతో, ఈ నెల 12 నుంచి 31 వరకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను 9వ తేదీన విడుదల చేస్తున్నామని టీటీడీ అధికారులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *