తెలుగు విద్యార్థుల కోసం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లాస్ ఏంజిల్స్లో స్పాట్ అడ్మిషన్లు
ఈ నెల 24 న హైదరాబాద్ ఆదిత్య పార్క్ హోటల్లో ,25న విజయవాడలో ఎడ్యుకేషన్ ఫెయిర్
భారీ స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లాస్ ఏంజిల్స్
హైదరాబాద్, జనవరి 22, 2023:
అమెరికాలో మూడేళ్ల ‘మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ లీడర్షిప్, మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ’ కోర్సు చేయాలనుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులకు శుభవార్త. వచ్చే విద్యా సంవత్సరానికి వారికి భారీ స్కాలర్షిప్లు ఆఫర్ చేస్తున్నాయి.ఈ విభాగంలో ప్రపంచంలోనే అగ్రగామి యూనివర్సిటీ ఒకటి ఇక్కడకే వచ్చి విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లను ఇవ్వబోతోంది. తెలంగాణ విద్యార్థుల కోసం హైదరాబాద్లో మంగళవారం, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు విజయవాడలో బుధవారం ఈ స్పాట్ అడ్మిషన్ల ఉంటాయని యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ రాబర్ట్ డబ్ల్యూ బ్రౌన్ ,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ,చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ డాక్టర్ టాలన్ బ్రౌన్ తెలిపారు. సుమారు 50 మంది వరకు విద్యార్థుల స్కాలర్ షిప్ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు .కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్లో ఉండే ‘ద యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లాస్ ఏంజిల్స్ (యుడబ్ల్యుఎల్ఎ)’ హైదరాబాద్లో జనవరి 24న విజయవాడలో జనవరి తర్వాత విజయవాడలో ఈ కార్యక్రమం ఉండనుంది. 25 వ తేదీన స్క్రీనింగ్ చేసి స్పాట్ అడ్మిషన్లు ఇస్తామన్నారు.

యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లాస్ ఏంజిల్స్ గురించి
1966లో స్థాపించిన యుడబ్ల్యుఎల్ఎ అత్యున్నత నాణ్యతతో, అందుబాటులో ఉండే ఫీజులతో, చాలా సౌలభ్యంగా ఉండే విద్యావిధానంతో అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థ.
గూగుల్, అమెజాన్ లాంటి ఐటీ దిగ్గజాల కార్యాలయాలకు అత్యంత సమీపంలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ విద్యాసంస్థ 8వేల డాలర్ల వరకు స్కాలర్షిప్లు అందిస్తోంది. మొత్తం మాస్టర్స్ కోర్సుకు 24,500 డాలర్ల ఖర్చయితే, అందులో మొత్తం 16,500 డాలర్ల ట్యూషన్ ఫీజులో ఈ మొత్తం తగ్గుతుంది. నిపుణులైన బోధనా సిబ్బంది, మంచి వాతావరణం ఉండటంతో పాటు.. ఇక్కడి యుడబ్ల్యుఎల్ఎ విద్యార్థి సంఘంలో వైవిధ్యం, జాతి, ఉద్యోగావకాశం, జీవిత అనుభవాలు, కెరీర్ లక్ష్యాలను సాధించడంలో గొప్పతనం అన్నీ ఉంటాయి.