గాన‌కోకిల ల‌తా మంగేష్క‌ర్ ఇక లేరు

భారతీయులు గర్వించదగ్గ పాటలు పాడి చరిత్రలో నిలిచిన గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. అనేక రోజులుగా ముంబయి బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఓ నేపథ్య గాయకురాలిగా మొదలైన ఆమె.. ప్రఖ్యాత గాయనిగా పేరు తెచ్చుకున్నారు.

భారత సినీ చరిత్రలో గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లతా మంగేష్కర్​ తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని బ్రీచ్​ కాండీ ఆసుపత్రిలో శ్వాససంబంధిత సమస్యలతో బాధపడుతూ మృతి చెందారు. లతా మంగేష్కర్.. 1929 సెప్టెంబరు 28న మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో జన్మించారు.. లతా మంగేష్కర్​ తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్​, శుద్దమతిల మొదటి సంతానం ల‌తా మంగేష్క‌ర్. ఐదేళ్ల వయసులోనే తండ్రి దగ్గర సంగీతంలో ల‌త ఓనమాలు నేర్చుకున్నారు.13 ఏళ్ల వయసులో తండ్రి మరణంతో సినీ రంగంలోకి 1942లో నేపథ్య గాయనిగా ప్రవేశించారు.
దేశ విభజన స‌మ‌యంలో ఖుర్షీద్, నుర్జహాన్ వంటి ప్రముఖ గాయకులు పాకిస్థాన్ వెళ్లిపోవడం వల్ల లతా మంగేష్కర్ దశ తిరిగింది. స్టార్ సింగర్​గా ఆమె పేరు తెచ్చుకున్నారు. లతా మంగేష్కర్ తొలిసారి ఓ మ‌రాఠి చిత్రంతో నేప‌థ్య గాయినిగా మారారు. ఆమె​ పాడిన తొలి పాటను సినిమా నుంచి తొలగించారు.
‘మహల్'(1949) సినిమాలోని ఆయేగా ఆనే వాలా పాటతో లతా కెరీర్​ మలుపు తిరిగింది. సొంత నిర్మాణ సంస్థలోని తెరకెక్కించిన ‘లేఖిని’ సినిమాలోని పాట జాతీయ అవార్డు వరించింది.
1948-78 మధ్య 30 వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్​ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. మొత్తంగా 980 చిత్రాలకు గాత్రాన్ని అందించారు. 36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. 1969లో పద్మభూషణ్, 1999లో పద్మ విభూషణ్, 2001లో భారతరత్న పురస్కారాలు సొంతం చేసుకున్నారు లతా మంగేష్కర్. కె.ఎల్.సైగల్​ పాటలంటే లతా మంగేష్కర్​కు చాలా ఇష్టం. ఆయనకు ఈమె వీరాభిమాని కావడం విశేషం.1963 భారత్-చైనా యుద్ధ సమయంలో లతా పాడిన అయే మేరే వతన్ కే లోగో పాట విని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 1962లో లతాపై విషప్రయోగం జరిగింది. చేసిందెవరో ఇప్పటికీ తెలియలేదు.1974లో లండన్​లోని రాయల్ ఆల్బర్డ్​ హాల్​లో సంగీత కచేరీ నిర్వహించారు లతా మంగేష్కర్. భారతీయ నేపథ్య గాయకుల రాణి అని లతా మంగేష్కర్​ గురించి టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కథనాన్ని ప్రచురించింది.1999లో ఆమె పేరు మీద లతా ఎయు డె పెర్ఫ్యూమ్ అనే సుగంధ ఉత్పత్తి విడుదల చేశారు. 92 ఏళ్ల వయస్సున్న లతా మంగేష్కర్ కొవిడ్ భారినపడి మ‌ర‌ణించారు. హిందీ చిత్రసీమలో లతా పాటలు నాటికి నేటికి శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. తెలుగులో 1955 లో ANR సంతానం సినిమాలో నిదుర పోరా తమ్ముడా అనే పాట పాడారు. 1965 లో ఎన్టీఆర్ దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వేంకటేశ పాట అనే పాట‌ను …1988 లో నాగార్జున ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీర కు పాట పాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *