గ్రీన్ఇండియా చాలెంజ్ లోభాగంగా మొక్కలు నాటిన సింగర్ , నటి అక్షయ చందర్

హైదరాబాద్ : ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సింగర్, నటి అక్షయ చందర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అక్షయ చందర్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మనమందరం మెకానికల్ లైఫ్ లో బ్రతుకుతున్నాము కానీ మొక్కలు వాటి వల్ల జరిగే లాభాలు తెలుసుకోవలిసిన బాధ్యత మన మీద ఉంది అన్నారు. మొక్కలు ప్రాణ వాయువు మాత్రమే కాకుండా మానవ మనుగడకు కావలసిన చాలా వాటిని మనకు వృక్షాలు ఇస్తాయి కాబట్టి మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా మన మీద ఉంది అన్నారు. సమయం ఉన్నపుడు ప్రతీ ఒక్కరు ఒక్కొక్క మొక్క పెట్టాల్సిన బాధ్యత ఎంతయినా ఉంది అన్నారు. మనం తీసుకునే గాలి స్వచ్చంగా ఉండాలన్నా పొల్యూషన్ తగ్గించాలన్నా మొక్కలు అందరూ నాటాలని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *