రిషబ్ పంత్‎కి రోడ్డు ప్రమాదం.. కారు దగ్ధం

ప్రమాదంలో దగ్ధమైన కారు

టీమిండియా ఆటగాడు రిషభ్ పంత్‎కి రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్ రూర్కీ దగ్గర పంత్ కారు అదుపు తప్పి డివైడర్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్‎కి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు రిషబ్‎ను వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం కారులో మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో ప్రాణాలు దక్కించుకునేందుకు పంత్ కారులో నుంచి దూకేసినట్లు తెలుస్తోంది. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు చెలరేగిన సమయంలో పంత్ కారులో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రూర్కీ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్

బంగ్లాదేశ్‎తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‎లో పంత్ ఆడిన విషయం తెలిసిందే. జనవరిలో జరగబోయే శ్రీలంకతో సిరీస్‎కు పంత్‎ను సెలక్షన్ టీమ్ ఎంపిక చేయలేదు. మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి రిషబ్ పంత్ దుబాయ్‎లో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *