రోడ్లను బాగు చేయండి : ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో గురువారం ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖల మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రం లో రోడ్ల పరిస్థితి పైన, రోడ్లను ఎప్పటికీ చెక్కు చెదరకుండా అద్దాల మాదిరి గా ఉంచేందుకు చేపట్టవలసిన చర్యలు పాడయిన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయడం, పరిపాలన సంస్కరణ లో భాగంగా బాధ్యతల వికేంద్రీకరణ, పనుల నాణ్యత పెంచే దిశగా రోడ్లు భవనాలు శాఖలో చేపట్టాల్సిన నియామకాలు, తదితర కార్యాచరణ పై ముఖ్యమంత్రి సమీక్షించారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, పైలట్ రోహిత్ రెడ్డి, దానం నాగేందర్, మైనంపల్లి హన్మంతరావులతోపాటు, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం సెక్రటరీలు భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు, సంజీవరావు, ఆర్ అండ్ సెక్రటరీ శ్రీనివాసరాజు, రవీందర్ రావు, ఫైనాన్స్ సెక్రటరీ రోనాల్డ్ రాస్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *