యాదాద్రికి రికార్డుస్థాయిలో ఆదాయం

యాదాద్రి క్షేత్రానికి రూ.1 కోటికిపైగా ఆదాయం

చరిత్రలో ఇదే ప్రథమం

ఆదివారం, కార్తీకమాసంతో పోటెత్తిన భక్తులు

రూ.1,09,82,000 ఆదాయం

హైదరాబాద్ :

తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాదాద్రి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. రూ 1,09,82,000 ఆదాయం వచ్చింది. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం చరిత్రలో ఇదే ప్రథమం. కార్తీక మాసం, ఆదివారం నేపథ్యంలోనే ఈరోజు

యాదాద్రికి భక్తులు పోటెత్తారని అధికారులు పేర్కొన్నారు. యాదిగిరిగుట్టలో గతంలో ఉన్న ఆలయాన్ని టీఆర్ఎస్ సర్కారు భారీ ఎత్తున అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆలయ పునర్ నిర్మాణాన్ని అద్భుతమనదగ్గ రీతిలో చేపట్టింది. అందుకోసం సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సాయాన్ని కూడా తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *