నూతన సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్ :

ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులను శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు.


నిర్మాణ ప్రాంగణం అంతా సుమారు నాలుగు గంటల పాటు కలియతిరిగారు. మెయిన్ ఎంట్రన్స్, ల్యాండ్ స్కెప్ ఏరియా, పోర్టికో,అంతర్గత రోడ్లు, ఫౌంటైన్ల నిర్మాణం, గ్రానైట్ ఫ్లోరింగ్,మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, జీఆర్సి పనులు, కోర్ట్ యార్డ్ ల్యాండ్ స్కేప్ పనులు,రెడ్ సాండ్ స్టోన్, ఫైర్ వర్క్స్,ఎలక్ట్రికల్ వర్క్ ఫ్లోర్ వైస్ పనులు పరిశీలించారు. అధికారులకు, వర్క్ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు. నిర్మాణ తుది దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పనుల్లో ఇంకా వేగం పెంచాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి వారికి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ చారిత్రాత్మక కట్టడమైన ఈ పరిపాలన భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని, ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనల ప్రకారం తెలంగాణ వైభవం ఉట్టి పడేలా సెక్రటేరియట్ తుది దశ పనుల్లో మనసుపెట్టి పనిచేయాలని అధికారులకు, వర్క్ ఏజెన్సీకి మంత్రి సూచించారు. మంత్రి వెంట నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎస్.ఈ లు సత్యనారాయణ, లింగారెడ్డి,ఈ.ఈ శశిధర్,శ్రీనివాస్,పలువురు ఆర్ అండ్ బి అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *