నల్లగొండ జిల్లా వంగపర్తికి చెందిన ఆటో గర్ల్ సబితకు మంత్రి కేటీఆర్ అండ
ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతూ తన కుటుంబ పోషణ కోసం ఆటో నడిపిస్తున్న సబిత
సబితను ప్రగతి భవన్ పిలిపించుకొని సహాయం అందించిన కేటీఆర్
హైదరాబాద్ ప్రగతి భవన్
కుటుంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడిపిస్తున్న ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థిని ఆటో గర్ల్ సబితకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతూ పేదరికంలో ఉన్న తన కుటుంబ సభ్యుల కోసం ఆటో నేర్చుకొని తద్వారా ప్రతిరోజు కొన్ని డబ్బులు సంపాదిస్తున్న నల్గొండకు చెందిన సబిత విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది.
వెంటనే ఆయన ఆమెకు అండగా ఉండేందుకు నిర్ణయం తీసుకొని, ఈ మేరకు ఆమెకు సహాయం అందించాల్సిందిగా నల్గొండ జిల్లా కలెక్టర్ ను కోరారు. సబిత కేవలం మగవారే సాధారణంగా ఆటోను నడిపించే పనికి పూనుకొని ధైర్యంగా దాంతో కుటుంబాన్ని నిలబెట్టిన తీరు పట్ల మంత్రి అశ్యర్యం వక్తం చేశారు. ఆమెను స్వయంగా కలిచి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు
సబితను ప్రగతి భవన్ కి పిలిపించుకొని ఆమెతో సంభాషించారు. సవిత కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ ఆమెకి ఏం కావాలో తెలుసుకున్నారు.కొద్ది సంవత్సరాల కిందట తన తండ్రిని కోల్పోయిన సబితా తన తల్లి ఓహోటల్ లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వచ్చిందని తెలిపింది. సబిత పేదరికం దృష్టిలో ఉంచుకొని రెండు పడకల గదితోకి సంబందించిన ప్రొసీడింగ్స్ తో పాటు ఆమె అడిగిన నూతన ఆటో రిక్షా ను మంత్రి కేటీఆర్ అందించారు . సబిత చదువుకుంటా అంటే ఆమెకు సహాయం చేస్తానని మంత్రి కేటీఆర్ హామి ఇచ్చారు . భవిష్యత్తులోనూ ఆమెకు అండగా ఉంటామని తెలిపారు.
యువ మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలుగుతారని సబిత నిరూపించిందని, పట్టుదల ఉంటే కష్టాలను ఎదుర్కోవడం అసాధ్యం కాదని నిరూపించిన గొప్ప ధైర్య సాహసి సబితా అన్నారు. సబితా తన కుటుంబానికి అండగా నిలిచిన తీరు యువతులకు ఖచ్చితంగా స్ఫూర్తిని ఇస్తుందన్నారు.
మంత్రి కేటీఆర్ తన ప్రయత్నాలకు అండగా నిలవడం పట్ల సబిత సంతోషం వ్యక్తం చేశారు. తనను పిలిపించుకొని తన గురించి వివరాలు అడిగి తెలుసుకొని కుటుంబానికి సహాయం అందించడం ఎన్నటికీ మరచిపోలేని ఆమె తెలిపింది. కేటీఆర్ అందించిన సహాయం, స్ఫూర్తితో భవిష్యత్తు లో మరిన్ని మంచి లక్ష్యాలను చేరుకుంటానన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేసింది.