భోగి మంటలు వెలిగించి, గ్రామస్తులతో కోలాటమాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పర్వతగిరి : భోగి పండుగ పురస్కరించుకొని పర్వతగిరి లోని మంత్రి నివాసం వద్ద భోగిమంటల సంబరాల్లో *రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.

కొబ్బరికాయ కొట్టి, పూజ చేసి, భోగి మంటలు వెలిగించి గ్రామస్తులతో కలిసి కోలాటం వేశారు. అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలంతా భోగభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. మంత్రి స్వగృహం వద్ద గ్రామస్తులు మంత్రితో ఆనందంగా ఈ భోగి సంబరాల్లో పాల్గొని సంక్రాంతి పాటలకు కోలాటం వేశారు.
