అన్నదాతలకు అండగా జనసేన.. ఈ నెల 18న రైతు భరోసా కార్యక్రమం

ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతులకు జనసేన అండగా నిలుస్తోంది. ఇప్పటిదాకా ఏడు జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్రను ఆ పార్టీ పూర్తి చేసింది. మృతి చెందిన రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించింది. ఇక తాజాగా మరోసారి రైతన్నలకు అండగా నిలిచేదుకు సిద్ధమవుతోంది. ఈ నెల 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా కార్యక్రమం చేపడుతున్నట్టు ఆ పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడేళ్లలో అధికారిక లెక్కల ప్రకారం 1,673 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వివరించారు. రైతు స్వరాజ్య వేదిక సర్వే ప్రకారం ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల సంఖ్య 3 వేలకు పైనే ఉందని తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ నుంచి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 7 జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమం పూర్తయిందని నాదెండ్ల పేర్కొన్నారు.

కౌలు రైతుల కోసం జనసేన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *