31న వెబ్సైట్లో గ్రూపు-1 హాల్టిక్కెట్లు
అమరావతి :

రాష్ట్రంలో వచ్చేనెల ఎనిమిదో తేదీన జరిగే గ్రూపు-1 స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమ్స్) రాసేందుకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల హాల్టిక్కెట్లను ఈ నెల 31వ తేదీన వెబ్సైట్లో ఉంచుతామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. జిల్లాల వారీగా కేటాయించిన పరీక్షా కేంద్రాల జాబితాను కూడా అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.