పనస గ్రూప్ అసోసియేషన్తో హైదరాబాద్లో అడుగు పెట్టిన గ్లోబల్ ఛాయిస్ ఇమ్మిగ్రేషన్
హైదరాబాద్
గ్లోబల్ ఛాయిస్ కన్సల్టేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ

కొలంబోలో ఆసియా ప్రధాన కార్యాలయంతో కెనడియన్ కంపెనీ గ్లోబల్ ఛాయిస్(జీసిఐ), సిలికాన్ హబ్లో పెట్టుబడి పెట్టాలనే లక్ష్యంతో భారత గడ్డపైకి ప్రవేశించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నందగిరి హిల్స్ లో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఛాయిస్ కార్యాలయాన్ని శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ రెగ్యులేటెడ్ కెనడియన్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్, వాంకోవర్లో జీసీఐకి నాయకత్వం వహిస్తున్న రవి పనస ప్రారంభించారు.ఈ సందర్భంగా అర్జున్ రణతుంగ మాట్లాడుతూ హైదరాబాద్ కి నేను చాలా సార్లు వచ్చానని.. హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. గ్లోబల్ ఛాయిస్ ఇమ్మిగ్రేషన్ తన హైదరాబాద్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఒక దశాబ్దం అనుభవం వారి అనుభవజ్ఞులైన ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్లను వేలాది మంది ఔత్సాహికులు విదేశాలకు వెళ్లడానికి సహాయం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు. అర్హులైన అభ్యర్థులకు సరైన అవకాశాలతో హైదరాబాద్కు సహాయం చేయగలమని విశ్వసిస్తున్నామన్నారు. జీసిఐ నైతికత మరియు సమగ్రతతో పని చేస్తుందని, హైదరాబాద్ మరియు భారతదేశంలో కూడా మరింత విస్తరించేందుకు ఎదురుచూస్తున్నామని అన్నారు.

పనస గ్రూప్ నిర్వహకులు రవి పనస మరియు ఉపేంద్ర గౌడ్ మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా పీఆర్ , స్టడీ వీసా, వర్క్ వీసా, విజిట్ వీసా, బిజినెస్ వీసా, స్పౌజ్ వీసా, సూపర్ వీసా, పీఎన్పీ, ఎక్స్ప్రెస్ ఎంట్రీ, ఇన్వెస్ట్మెంట్ వీసా మరియు స్టేట్ నామినేషన్ వంటి అన్ని రకాల వీసాలను అందించనున్నారు. కెనడాలో విహారయాత్రకు వెళ్లడంతోపాటు కెనడాకు వలస వెళ్లడం లేదా చదువుకోవాలనే వారికీ ఇక్కడ సేవలు అందిస్తారన్నారు. గ్లోబల్ ఛాయస్ మీడియా తో పనస మీడియా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది అన్నారు.