అంతర్జాతీయ పులుల దినోత్సవం రోజున పులి చర్మాన్ని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
ములుగు జిల్లా….
ఏటూరునాగారం మండలం ముల్లకట్ట గోదావరి వంతెన వద్ద పులి చర్మం తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా వద్దనుంచి పులి చర్మంతో పాటు ద్విచక్రవాహనం, మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్ గడ్ కు చెందిన సాగర్ అనే వ్యక్తి ద్వారా పులి చర్మాన్ని సేకరించిన వాజేడుకు చెందిన తిరుమలేష్ చత్తీస్ గడ్ కు చెందిన సత్యం అనే వ్యక్తి సహాయంతో రూ.30లక్షలకు విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నారు. ఈక్రమంలో పులి చర్మాన్ని తరలిస్తుండగా ఏటూరునాగారం పోలీసులు పట్టుకున్నారు. వారిపై అటవీ సంరక్షణ చట్టం కింద కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో సంబంధమున్న మిగిలిన వారిని పట్టుకుంటామని ఎస్పీ సంగ్రాoసింగ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్, ఐ ఎఫ్ ఎస్ శివ ఆశిష్ సింహం ,ప్రశాంత్ పాటిల్ , స్పెషల్ ఆఫీసర్ ఏటూరునాగారం , కిరణ్ ,సీఐ ఏటూరు నాగారం , శ్రీకాంత్ రెడ్డి ఎస్ ఐ ,శ్యాం ప్రసాద్ పోలీసు , అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు