నారా లోకేష్ యాత్రకు సర్వం సిద్ధం..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాదయాత్రకు యువగళం పేరును నిర్ణయించారు. వచ్చే నెల 27 నుంచి లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. మొత్తం 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు ఆయన నడవనున్నారు. పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది.

ఇక ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఉండేలా పాదయాత్ర ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు లోకేశ్ సూచించారు.