డైమండ్ జువెలరీ ధరించడం అంటే తనకెంతో ఇష్టం : దీక్ష పంత్
వజ్రాలతో తయారు చేసిన అభరణాలు ధరించడమంటే తనకెంతో ఇష్టమని సినీనటి దీక్షపంత్ అన్నారు
హైదరాబాద్ పార్క్ హయత్లో రెండు రోజుల పాటు జరగనున్న దివా జువెలరీ ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు.
దేశంలోని ప్రముఖ జువెలరీ సంస్థలు ఈ ఎగ్జిబిషన్లో తమ కలెక్షన్స్ను ప్రదర్శించాయి. బంగారు ,వెండి, వజ్రాభరణాలతో కూడిన ఈ ఎగ్జిబిషన్ రెండు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు .