బూస్టర్ డోస్ మస్త్.. ఇంకా తీసుకోలేదా అయితే జాగ్రత్త..!
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఆందోళన కల్పిస్తుంది. BF-7 వేరియంట్ ఇప్పటికే చైనా తో పాటు ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టిస్తుంది. భారత్లో కూడా తాజాగా కరోనా కొత్త వేరియెంట్ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ఒకటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. మన దేశంలో వయోజనుల్లో అధిక శాతం కరోనా టీకా రెండు డోసులను తీసుకున్నారు. అనంతరం బూస్టర్ డోస్ తీసుకోవాలంటూ నిపుణులు సూచించినప్పటికీ ప్రజల నుంచి పెద్దగా ఆసక్తి కనిపించలేదు. దీనికి కారణం కరోనా మూడో వేవ్ ఒమిక్రాన్ లో తీవ్రత చాలా వరకు తగ్గిపోవడమే. మరణాల రేటు కూడా చాలా స్వల్ప స్థాయికి పరిమితమైంది. దీంతో బూస్టర్ డోస్ కు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు చైనా సహా పలు దేశాల్లో కరోనా బీఎఫ్ 7 వేరియంట్ చాలా ఉధృతంగా ఉండడం, మరణాలు రేటు ఎక్కువగా ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అప్రమత్తత పెరిగింది.
కనుక బూస్టర్ డోస్ తీసుకోవాలని మరోసారి కేంద్ర ప్రభుత్వం, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ టీకాను బూస్టర్ డోస్ కింద ఇచ్చేందుకు కేంద్ర సర్కారు అనుమతి మంజూరు చేసింది. కనుక రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోస్ తీసుకోవాలంటే, కోవిన్ యాప్ లో నమోదు చేసుకుంటే సరిపోతుంది. మొదటి రెండు డోసులతో వచ్చిన వ్యాధి నిరోధకత కొంత కాలానికి తగ్గిపోతుంది. బూస్టర్ డోస్ తీసుకోవడం వల్ల ఇది తిరిగి బలపడుతుంది. వైరస్ పై పోరాడే విషయంలో మన రోగ నిరోధక వ్యవస్థకు బూస్టర్ డోస్ మద్దతుగా నిలబడుతుంది.
బూస్టర్ డోస్ కోసం కోవిన్ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చు. గతంలో రెండు డోసుల సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ ఆధారంగా లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత బూస్టర్ డోస్ కు అర్హత ఉంటే అక్కడ చూపిస్తుంది. కరోనా రెండో డోస్ తీసుకుని 9 నెలలు అయిన వారు బూస్టర్ డోస్ కు అర్హులు. అర్హత ఉన్నట్టు చూపిస్తే షెడ్యూల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. పిన్ కోడ్ నమోదు చేస్తే సమీపంలోని టీకా కేంద్రాల
