టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్

CM Jagan visits TTD EO Dharmareddy home

తిరుమల తిరుపతి ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో, సీఎం జగన్ తీవ్ర విషాదంలో ఉన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం జగన్ నేడు నంద్యాల జిల్లా పారుమంచాల వెళ్లారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ధర్మారెడ్డితోనూ, ఆయన కుటుంబసభ్యులతోనూ మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ పేర్కొన్నారు. తన కుమారుడి చిత్ర పటానికి సీఎం జగన్ నివాళులు అర్పించే సమయంలో ధర్మారెడ్డి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. భోరున విలపించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *