వేమన చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి
అమరావతి :
యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
యోగి వేమన జయంతిని ఏటా జనవరి 19న అధికారికంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ మేరకు ఇటీవల జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.