అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్మించిన కేంద్రీకృత వంటశాలను ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
ఆత్మకూరులో కేంద్రీకృత వంటశాలను ప్రారంభించిన సీఎం
గుంటూరు,
గుంటూరు జిల్లా ఆత్మకూరులో ఇస్కాన్ ఆధ్వర్యంలో అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించిన కేంద్రీకృత వంటశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు.
అనంతరం తాడేపల్లి మండలం కొలనుకొడంలో ఇస్కాన్ సంస్థ నిర్మించనున్న గోకుల క్షేత్రానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో కేవలం 2 గంటల్లోనే 50 వేల మందికి ఆహారం సిద్ధం చేసే వంటశాలను అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్మించింది , జగనన్న గోరుముద్ద పథకానికి అక్షయపాత్ర ఫౌండేషన్ ఆహారం అందజేస్తోంది. వంటశాల, భోజనం ప్యాకింగ్ ఏర్పాట్లను సీఎం జగన్ పరిశీలించారు. విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా భోజనం వడ్డించారు. మధ్యాహ్న భోజనం సరఫరా చేసే వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు.
గోకుల క్షేత్రానికి సీఎం జగన్ భూమిపూజ :
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొడంలో ఇస్కాన్ సంస్థ నిర్మించనున్న గోకుల క్షేత్రానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు. రూ.70కోట్లతో ఏర్పాటు చేయనున్న గోకుల క్షేత్రంలో రాధాకృష్ణులు, వేంకటేశ్వరస్వామి ఆలయాలతోపాటు యోగ ధ్యాన కేంద్రాలు, సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు, యువత కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.