శోక సముద్రంలో సిని సంగీత అభిమానులు భారతదేశపు ముద్దుబిడ్డ లతా మంగేష్కర్ మృతి దేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటు -నందమూరి బాలకృష్ణ

లతా మంగేష్కర్ మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి కల్గించిందని హిందూపురం ఎమ్మెల్యే, సినీ న‌టుడు బాల‌కృష్ణ అన్నారు . భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ లతా మంగేష్కర్ అని.. 7దశాబ్దాల్లో 30కి పైగా భాషల్లో 30వేల పాటలు పాడటం లతామంగేష్కర్ గానమాధుర్యానికి నిదర్శనమ‌న్నారు. దేశంలో ఆమె పాట వినబడని ఇల్లు లేదు, ఆమె గానం మెచ్చని వ్యక్తి లేడు.. ఆమె పొందని అవార్డు లేదు, రాని రివార్డు లేదుని బాల‌య్య అన్నారు. భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే…అవార్డులే కాదు విదేశీ ప్రభుత్వాలు కూడా పలు పురస్కారాలందించి ఆమెను గౌరవించాయన్నారు.
లతా మంగేష్కర్ మృతి మనదేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటు అని బాల‌కృష్ణ తెలిపారు ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాన‌ని.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *