నరేంద్ర అరెస్టు విషయంలో సిఐడి ప్రకటన అబద్దాల పుట్ట: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్

సిఐడిని జగన్ జేబు సంస్థగా మార్చిన ADG సునీల్ కుమార్ ను ఆ పోస్టు నుంచి తొలగించాలి*

అమరావతి:

ఎపి సిఐడి చీఫ్, అడిషనల్ డిజీ సునీల్ కుమార్ ను ఆ పోస్టునుంచి వెంటనే తొలగించి…సిఐడి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. సిఐడి విభాగాన్ని జగన్ జేబు సంస్థగా మార్చి రాజకీయ వేధింపులకు, దాడులకు వాడుతున్న సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టిడిపి మీడియా కో ఆర్డినేటర్ నరేంద్ర అరెస్టుపై సిఐడి ప్రకటన అబద్దాల పుట్ట అని చంద్రబాబు మండిపడ్డారు. ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారం దొరికింది వాస్తవం కాదా…దానిపై సోషల్ మీడియా పోస్టును పార్వర్డ్ చేస్తే రాత్రికి రాత్రి అరెస్టు చేయడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. ఇదే కేసులో జర్నలిస్ట్ అంకబాబును అరెస్టు చేస్తే.. అది అక్రమం అని కోర్టు చెప్పినా…ఇప్పుడు అదే కేసులో నరేంద్రను అరెస్టు చేయడం నిబంధనలు ఉల్లంఘించడం కాదా అని ప్రశ్నించారు. 41 ఎ నోటీసు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సిఐడి కస్టడీలో నరేంద్రను దారుణంగా హింసించారని…ఇంత దారుణాలకు ఒడికడుతున్న అధికారులు రేపు అనేది ఉంటుందని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. నరేంద్రను టార్చర్ పెట్టిన పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *