ముస్లీం సోద‌రుల‌కు బ‌క్రీద్ శుభాకాంక్ష‌లు తెలిపిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి

ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగాల పండుగ బక్రీద్. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు.దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారన్నారు. ఈ పండుగ సమయంలోనే ముస్లింలు పవిత్రమైన మక్కా యాత్రకు వెళ్ళడం సంప్రదాయంగా భావిస్తారన్నారు. భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆకాంక్షించారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అభిలషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *