సేంద్రియ పంట ఉత్పత్తులు వాడటం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు:బాలకృష్ణ సతీమణి వసుందర

హైదరాబాద్ ,మాదాపూర్

సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంట ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా  ఆరోగ్యంగా ఉండవచ్చని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర అన్నారు.

హైదరాబాద్ మాదాపూర్‌ ఇనార్బిట్ మాల్ రోడ్‌లోని గఫూర్ నగర్‌లో  ఏర్పాటు చేసిన 40 వ ఫ్యూ ఓ న్యాచురల్ వెజిటబుల్ మార్ట్‌ను ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా  నందమూరి వసుంధర దేవి మాట్లాడుతూ ఫలాలు ఆరోగ్య పరిరక్షణకు సంజీవనిగా పని చేస్తాయని అన్నారు. శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు, ఆకు కూరలు తీసుకోవటం ఈ రోజుల్లో ఎంతో అవసరమన్నారు యాంత్రిక జీవనంలా మారిన ఈ రోజుల్లో   పండ్లు ఫలాలు, ఆకుకూరలు తీసుకోవటం  మరింత అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు .

ప్యుర్ ఓ న్యాచురల్ వ్యవస్థాపకులు మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా వాషింగ్టన్ థాయిలాండ్ యు.ఎస్  వంటి దేశాల నుండి దిగుమతి చేసిన విభిన్న ఫలాలను ఫ్యూర్ ఓ న్యాచురల్‌ స్టోర్‌లో  అందుబాటులో ఉంచామన్నారు .25 రకాల విదేశీ ఫలాలతో పాటు పాటు ఆంధ్ర,తెలంగాణ రైతులు పండించిన ఆకుకూరలు లభిస్తాయన్నారు . ఈ నెలాఖరు  కల్లా  నగరం లో మారో  మూడు ఔట్ లెట్ లను  ప్రారంభిస్తున్నట్లు మల్లికార్జున తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *