దీపావళి పండుగను పురస్కరించుకొని కిడ్స్ ఫర్ కిడ్స్ ప్రచారంతో పాటు మిస్డ్ కాల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఆశీర్వాద గులాబ్ జామ్
హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు చేరువేందుకు ఐటిసి కంపెనీ ఆశీర్వాద గులాబ్ జామ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని స్కూల్ విద్యార్థులకు గులాబ్ జామ్ తయారీ పై ఆశీర్వాద్ గ్రూప్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు చేరువయ్యేందుకు మిస్డ్ కాల్ ఉద్యమాన్ని చేపట్టింది. మిస్సుడు కాల్ చేసిన విద్యార్థులకు ఐదు గులాబ్ జాములు తయారు చేసుకునేందుకు ముడి పదార్థాలు అందించేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్ , వైజాగ్లలో ఈ దీపావళికి ప్రత్యేకమైన కార్యక్రమం ‘కిడ్స్ ఫర్ కిడ్స్’ ను ప్రారంభించింది. హైదరాబాద్ , వైజాగ్లోని 500 మంది పాఠశాల విద్యార్థులతో గులాబ్ జామూన్లను చేతితో తయారు చేయడానికి ఆశీర్వాద్ బ్రాండ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాల విద్యార్థులు తయారు చేసే ప్రతి గులాబ్ జామూన్కు, ఆశీర్వాద్ గులాబ్ జామున్ ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణాలలోని గ్రామీణ పాఠశాలల్లోని పిల్లలకు ఐదు రెట్లు ఎక్కువగా గులాబ్ జామూన్లను తయారు చేసేందుకు ముడి పదార్ధాలను అందించింది. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ ప్రచారంలో తొలి దశ అద్భుతమైన విజయం దక్కిన అనంతరం, విస్తృతంగా ప్రజలను చేరుకునేందుకు, అలాగే గ్రామీణ పాఠశాలల్లోని చిన్నారులకు ఈ దీపావళిని ప్రత్యేకంగా నిలపడం కోసం, ప్రేక్షకులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో, రెండవ దశ ప్రచారాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లలో ప్రారంభించింది. అందరూ 84639 84639 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఈ ప్రచారంలో పాల్గొనవచ్చు. అందుకున్న ప్రతి మిస్డ్ కాల్కు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలోని గ్రామీణ పాఠశాలల్లో ఉన్న పిల్లలకు 5 గులాబ్ జామూన్లను సిద్ధం చేయడానికి ఆశీర్వాద్ గులాబ్ జామున్ అవసరమైన పదార్థాలను అందిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ పాఠశాలల్లో లక్ష మంది పిల్లలను చేరవేయాలని ఆశీర్వాద్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమం గురించి గణేష్ సుందరరామన్, ఎస్బీయూ చీఫ్ ఎగ్జిక్యూటివ్, స్టేపుల్స్, స్నాక్స్ మరియు మీల్స్, ఫుడ్. బిజినెస్, ఐటీసీ లిమిటెడ్, మాట్లాడుతూ “ప్రేమ, ఆనందం, వెలుగు జిలుగులను పండుగలు పంచపెడతాయి. ఈ కార్యక్రమం ద్వారా, పిల్లలలో పంచుకునే ఆనందాన్ని తిరిగి తీసుకువచ్చి, వేడుక చేసుకోవాలని ఆశీర్వాద్ గులాబ్ జామున్ కోరుకుంది. ఈ కార్యక్రమం ఇందులో పాల్గొనే వారి ముఖాలలో చిరునవ్వులను తీసుకు వస్తుందని, అలాగే ఈ పండుగ సీజన్ను మరుపు రానిదిగా చేస్తుందని మేము ఆశిస్తున్నాము,” అన్నారు.
సద్గురు శ్రీ మధుసూదన్ సాయి, ఫౌండర్, శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్, మాట్లాడుతూ “ఈ దీపావళికి శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్లో, మేము ఆశీర్వాద్ గులాబ్ జామున్ మిక్స్ సహకారంతో, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ వ్యాప్తంగా మనకు మాదిరిగా పండుగ ఆనందాన్ని ఆస్వాదించలేని వారి కోసం, లక్ష మంది గ్రామీణ పాఠశాల విద్యార్థులతో కలిసి పండుగ యొక్క మధురమైన ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నాము,” అని తెలిపారు.