ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను ఇంటర్బోర్డు అధికారులు విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న ఎతిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 24న పర్యావరణ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. సెకండియర్ విద్యార్థులకు ఏప్రిల్ 15 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
