ఏపీలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు అధికారులు విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న ఎతిక్స్‌, హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష, 24న పర్యావరణ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. సెకండియర్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 15 నుంచి 25 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *