ఆన్లైన్ క్రీడల క్రమబద్ధీకరణపై అధ్యయనం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10:
దేశంలో ఆన్లైన్ ఫాంటసీ క్రీడల ప్లాట్ఫార్మల క్రమబద్దీకరణకు జాతీయ స్థాయిలో అమలు చేయవలసిన మార్గదర్శకాలపై నీతి అయోగ్ రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలపై వివిధ మంత్రిత్వ శాఖవు అధ్యయనం చేస్తున్నట్లు క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్ చెప్పారు. రాజ్యసభలో గురువారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశంలో ఫాంటసీ క్రీడలు వాటితో అనుబంధమైన ఫ్లాంట్ఫారంలను ఆవిర్భవిస్తున్న రంగంగా పరిగణిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో ఫాంటసీ క్రీడలకు నానాటికీ పెరుగుతున్న ఆదరణ, క్రీడల ప్రోత్సాహంలో వాటి పాత్రను ప్రభుత్వం గుర్తించిందా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.