తెలంగాణ లో రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదిగా కుదుటపడుతోంది. కరోనా లాక్డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చిన నేపథ్యంలో స్థిరాస్తి రంగం తిరిగి కోరుకుంటుంది . కరోనా నేర్పిన గుణపాఠం తో సొంతిల్లు ఉంటేనే మంచిదని భావన ప్రజల్లో పెరిగింది .దీనికితోడు బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద కొత్తగా నిర్మించుకోవాలనుకునే ప్రజలకు మూడున్నర లక్షల సబ్సిడీ ఇస్తుంది. ప్రజలు ఇల్లు, ప్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు . భూమి మీద మంచి ఆదాయం సంపాదించుకోవాలనే వారు అర్బన్ ఫాం ల్యాండ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు , రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు అర్బన్ ఫాం ల్యాండ్ లను కొనుగోలు అక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. ఇలాంటి వారి కోసం కోసం సిరివ వనం ఇన్ఫ్రా సంస్థ బృందావనం అర్బన్ ఫాం హోమ్ ల్యాండ్ ను అందుబాటులో కి తీసుకువచ్చింది . ఈ అర్బన్ ఫాం ల్యాండ్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం
హైదరాబాద్ ముంబై జాతీయ రహదారి లో సదాశివపేట సమీపంలో సిరివనం ఇన్ఫ్రా సంస్థ వంద ఎకరాల విస్తీర్ణంలో అర్బన్ ఫాం ల్యాండ్ వెంచర్ ను తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో నిర్మించనున్న హౌస్ కు ఫ్రీ మెంబర్ షిప్ సౌకర్యం కల్పించారు 100 శాతం వాస్తుతో 303 ,605 చదరపు గజాల విస్తీర్ణంలో ఫాం హౌస్ లు నిర్మించుకునేలా ఫ్లాటింగ్ వేశారు. 303 చదరపు గజాల విస్థీర్ణంలో 25 శ్రీ గంధం మొక్కలు ,మరో 25 ఆర్గానిక్ ఫ్రూట్ మొక్కలను పెంచనున్నారు. ఈ శ్రీగంధం చెట్ల ద్వారా వచ్చిన కలపను విక్రయించిన ఆదాయంలో 50 శాతం వినియోగదారుల కు మిగిలిన 50 శాతం యాజమాన్యం మెయింటినెన్స్ కోసం తీసుకుంటుంది.దీంతో పాటు మిగిలిన ఫాం ల్యాండ్ లో 25 రకాల సీజనల్ మొక్కలను పెంచనుంది సిరివనం ఇన్ ఫ్రా సంస్థ.ఈ ఫ్రూట్ మొక్కల పెంపకం ద్వారా వచ్చిన ఫలాలను కస్టమర్ సొంతంగా వినియోగించుకోవచ్చు. ఇక 605 గజాల విస్తీర్ణంలో ఉన్న ఫాం ల్యాండ్ లో 50 శ్రీ గంధం మొక్కలు మరో యాభై ఆర్గానిక్ ఫ్రూట్ మొక్కలను అందిస్తున్నారు. శ్రీ గంధం మొక్కల పెంపకం ద్వారా వచ్చిన ఆదాయంలో సగం కస్టమర్ కు ఇస్తున్నారు. మిగిలిన సగం ఆదాయం చెట్ల సంరక్షణ కోసం యాజమాన్యం తీసుకుంటుంది. ఫాం ల్యాండ్ లో 50 రకాల సీజనల్ పండ్లు చెట్లను పెంచుతుంది. వీకెండ్స్ లో ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు వచ్చినవారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోంది యాజమాన్యం. క్లబ్ హౌస్ లో లో సభ్యులందరూ పుట్టినరోజు వేడుకలు ఇతర కార్యక్రమాలు చేసుకునేందుకు ఉచితంగానే అనుమతిస్తుంది. సిటీలో బిజీబిజీగా గడిపే నగరవాసులకు ఈ హౌస్ లో సరదాగా గడిపే అవకాశం కల్పిస్తుంది ఈ ఫాం హౌస్ లో పిల్లలతో వ్యవసాయం చేసుకునే వెసలుబాటు కల్పిస్తోంది సిరివనం ఇన్ ఫ్రా సంస్థ. ఈ ప్రాజెక్టు ఫాం ల్యాండ్ కొనుగోలు చేసిన వినియోగదారులకు 12 సంవత్సరాల పాటు ఉచితం గా సెక్యూరిటీని కల్పిస్తోంది సిరి వనం ఇన్ఫ్రా సంస్థ .ఆ తర్వాత వినియోగదారులు ఒక గ్రూపుగా ఏర్పడి భాద్యతలు నిర్వహించుకోవాలని యాజమాన్యం చెబుతోంది.
ఈ ప్రాజెక్టుకు కు మొయిన్ ఎంట్రెన్స్ 24×7 సెక్యూరిటీ సౌకర్యం కల్పించారు. ఈ ప్రాజెక్టులో ఫాం ల్యాండ్ కొనుగోలు చేసిన వినియోగదారుల కు క్లియర్ టైటిల్స్ తో పాస్ పుస్తకం , సేల్ డీడ్ , టైటిల్ డీడ్ , అందించడం జరుగుతుంది . వీటితో పాటు కస్టమైజ్డ్ విల్లాస్ ,ఫాం హౌస్ నిర్మించుకోవచ్చు .ఈ ప్రాజెక్టులో 20 x 40 ఫీట్ రోడ్ , విద్యుత్ సౌకర్యం ,డ్రైనేజ్ ,మంచినీటి సౌకర్యం కల్పించారు. ఈ బృందావం ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్ తో పాటు multi cuisine restaurant , స్విమ్మింగ్ పూల్ , చిల్డ్రన్ ప్లే ఏరియా , జాగింగ్ ట్రాక్ ,ఇండోర్ అవుట్ గేమ్స్ ,జిమ్ , ఓపెన్ ఆడిటోరియంలు అందుబాటులో ఉంచారు ఈ బృందావనం ప్రాజెక్ట్ హైదరాబాద్ మియాపూర్ నుంచి 56 కిలోమీటర్లు సికింద్రాబాద్ నుంచి 76 కిలోమీటర్లు జె.ఎన్.టి.యు నుంచి 60 కిలోమీటర్లు ఆరూరు నుంచి ఒక కిలోమీటర్
సదాశివపేట నుంచి 5 కిలో మీటర్లు
ఔటర్ రింగ్ రోడ్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది .
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబై హైదరాబాద్ జాతీయ రహదారిలో ఎకో ఫ్రెండ్లీ పారిశ్రామిక కారిడార్ లో ఈ బృందావనం ప్రాజెక్ట్ ను సిరివనం ఇన్ ఫ్రా సంస్థ తీసుకువచ్చింది.
మీరు పెట్టిన పెట్టుబడికి భవిష్యత్తులో మంచి లాభాలు అర్జించాలంటే …సిరివనం లో అర్బన్ ఫాం ల్యాండ్ లను తీసుకోవాలని యాజమాన్యం కోరుతుంది