లూయిస్ బ్రెయిలి కాంస్య విగ్రహం ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్

అంధుల ఆరాధ్య దైవం, బ్రెయిలి లిపి సృష్టికర్త డా”లూయిస్ బ్రెయిలి 214 వ జన్మదిన సందర్భంగా మలక్ పేట లోని దివ్యంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద లూయిస్ బ్రెయిలి పార్క్ లో 9 అడుగుల లూయిస్ బ్రెయిలి కాంస్య విగ్రహాన్ని ఎస్సి డెవలప్ మెంట్,దివ్యంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మలక్ పేట ఎమ్మెల్యే బలాల తో కలిసి ప్రారంభించారు.

లూయిస్ బ్రెయిలి జయంతిని అధికారకంగా నిర్వహించడం తో పాటు దివ్యాంగుల అభివృద్ధి,సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.దివ్యాంగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి కార్పొరేషన్ ద్వారా లోన్స్ అందించడం వారి చదువులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి అన్నారు.ఈ సందర్భంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *