రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువ‌యింది : పవన్​ కళ్యాణ్

గుంటూరు

విజయవాడలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం దుర్మార్గమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరవవుతోందన్న పపవన్ అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు శనివారం పవన్ నిర్వహించనున్న​ యాత్రకు అడ్డంకులు కలిగించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్​ ఆరోపించారు.

రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరవవుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం దుర్మార్గమన్నారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇంత ఘోరం జరిగేది కాదన్నారు. ఆస్పత్రిలో పని చేస్తున్నవారే అఘాయిత్యానికి ఒడిగట్టడం.. అక్కడి నిఘా, సెక్యూరిటీ లోపభూయిష్టానికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతోపాటు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని కోరారు. అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని జనసేనాని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ పట్ల పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పవన్ సూచించారు. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ చట్టం ఇప్పటికీ అమలు కావడం లేదన్న పవన్‌కల్యాణ్ దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *