పద్మ శ్రీ, పద్మభూషన్ అవార్డులు దక్కిన వారిని అభినందించిన సీఎం కేసీఆర్
జీవిత కాల విశిష్ట సేవలను గుర్తించి ఏటా భారత ప్రభుత్వం అందించే పద్మ” అవార్డులు తెలంగాణ కు చెందిన పలువురు ప్రముఖులకు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగం లో పద్మ భూషణ్ అవార్డ్ ను దక్కించుకున్న కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా, ఆర్ట్ విభాగం లో పద్మశ్రీ అవార్డు లను దక్కించుకున్న దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్య, పద్మజ రెడ్డి లను సీఎం కేసిఆర్ అభినందించారు.