ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టెస్ట్ ల ధరలను నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం
ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా చికిత్స ధరలను నిర్వహిస్తూ తెలంగాణ వైద్యారోగ్య శాఖ జీవో 40ని జారీ చేసింది .సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు నాలుగు వేల రూపాయలుగా నిర్ణయించారు. ఇక ఐసీయూ గదిలో కరోనా చికిత్స కు రోజుకు 7,500 రూపాయలు నిర్ణయించారు. వెంటిలేటర్తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్ఠంగా 9వేల రుపాయలు ,పీపీఈ కిట్ ధర 273 రూపాయలు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది.
హెచ్ఆర్ సీటీ-1995 రూపాయలు ,డిజిటల్ ఎక్స్ రే-1300 రూపాయలు ,ఐఎల్6- 1300 రూపాయలుగా నిర్ణయించింది
డీడైమర్-300రూపాయలు ,సీఆర్పీ-500రూపాయలు ,ప్రొకాల్ ,సీతోసిన్-1400 రూపాయలు,ఫెరిటీన్- 400 రూపాయలు,ఎల్డీహెచ్- 140రూపాయలు గా నిర్ణయించారు.
సాధారణ అంబులెన్స్కు కిలోమీటరుకు 75 రూపాయలు మినిమం ఛార్జ్ 2వేల రూపాయలు,
వసతుల తో కూడిన అంబులెన్సుకు కిలోమీటరుకు125 రూపాయలు..మినిమం ఛార్జ్ 3వేల రూపాయలుగా నిర్ణయించారు.