ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ ను కలిసిన సినీ నటుడు సోనూసూద్..

హైదరాబాద్

కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకుంటున్న సినీ నటుడు సోనుసూద్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శనీయంగా ఉన్నాయని కితాబిచ్చారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తు సోనుసూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్నారు కేటీఆర్..

హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల తన అనుబంధాన్ని సోనూసూద్ పంచుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర వహిస్తూనే, ఇతరులకంటే భిన్నంగా కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకుంటున్న కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనుసూద్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *