త్వరలో మహిళల హ్యాండ్ బాల్ ప్రీమియర్ లీగ్

హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు

జైపూర్:

క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు జాతీయ స్థాయిలో హ్యాండ్ బాల్ ప్రీమియర్ లీగ్ పోటీలకు నిర్వహించనున్నట్లు హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అరిశనపల్లి జగన్ మోహన్ రావు వెల్లడించారు

. జైపూర్ లో జరిగిన హెచ్ఎఫ్ఐ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పురుషుల హ్యాండ్ బాల్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ హక్కుల దక్కించుకున్న ‘ది బ్లూ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్’ సంస్థనే మహిళల హ్యాండ్ బాల్ లీగ్ ను కూడా నిర్వహించనుందని జగన్ మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జగన్ మోహన్ రావు తెలిపారు. కోవిడ్ మహమ్మారి వల్ల జనవరి లో వాయిదా పడ్డ పురుషుల హ్యాండ్ బాల్ లీగ్ ను కూడా ప్రభుత్వ అనుమతి తీసుకొని వచ్చే రెండు నెలల్లో నిర్వహించనున్నామన్నారు . పురుషుల హ్యాండ్ బాల్ లీగ్ ముగియగానే మహిళల హ్యాండ్ బాల్ లీగ్ ను నిర్వహిస్తామన్నారు . ఈ లీగ్స్ తో దేశంలో హ్యాండ్ బాల్ కు క్రేజ్ వస్తుందని జగన్ మోహన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో జగన్ మోహన్ రావు తో పాటు హెచ్ఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ ఈశ్వర్ పాండే, ది బ్లూ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ చైర్మన్ అజయ్ దత్త తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *