టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించిన కమిషనర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రూపొందించిన 2023 మీడియా డైరీని గురువారం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, పీసీఐ మాజీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, జాతీయ కార్యవర్గ సభ్యులు కే. సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిరణ్, ఏ.రాజేష్, వి.యాదగిరి, హాబీబ్ జిలానీ, హెచ్.యూ. జే అధ్యక్షులు శిగా శంకర్ గౌడ్, కార్యదర్శి హమీద్ షౌకత్ అలీ, రాష్ట్ర చిన్న, మధ్య తరగతి పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, ఉప ప్రధాన కార్యదర్శి అశోక్, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వాళ్ళ సమస్యలను పరిష్కరించండి

రాష్ట్రంలో చిన్న, మధ్యతరగతి పత్రికల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ కమిషనర్ అరవింద్ కుమార్ ను కోరారు. ముఖ్యంగా అప్ గ్రేడేషన్ లో జాప్యం జరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఉర్దూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరగా కమిషనర్ సానుకూలంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *