కేఎల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి
కె ఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ , హైదరాబాద్ క్యాంపస్ లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించిన KLEEE-2021 పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ ఇంచార్జి ఉప కులపతి డాక్టర్ N.వెంకట్రామ్ , కన్వీనర్ డాక్టర్ రామకృష్ణ , అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు, మేనేజ్మెంట్ హ్యుమానిటీ సైన్సెస్ విభాగం డైరెక్టర్ డాక్టర్ M.KISHOREBABU విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వెంకట్రామ్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం ఈ ఏడాది 40 వేలకు మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, పరీక్షలో ఉతీర్ణులైన వారికీ ర్యాంకులు కేటాయించామన్నారు. ఇంజనీరింగ్ తో పాటు KL విద్యా సంస్థలో అండర్ గ్రాడ్యుయేషన్ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ కింద అందించే అన్ని కోర్సులకు ఈ నెల 11వ తెదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఏడాది 100 కోట్ల రూపాయల వరకు విద్యార్థులకు స్కాలర్ షిప్ కింద కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం KLEEE లో మెరిట్ ర్యాంకులు వచ్చిన వారికి 35 కోట్లు , JEE మైన్స్ పర్సెంటైల్ ఆధారంగా 30 కోట్లు, ఇంటర్ మార్కుల ఆధారంగా 15 కోట్లు ఇస్తున్నామన్నారు. మేనేజ్మెంట్ , హ్యుమానిటీ సైన్సెస్ కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం 20 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ప్రొఫెసర్ వెంకట్రామ్ వివరించారు. JEE మెయిన్స్ లో 96 శాతం అంత కన్నా ఎక్కువ వచ్చిన వారికి స్కాలర్ షిప్ కింద ఫీజులో పూర్తి రాయితీ ఇస్తున్నామన్నారు. అలాగే ఇంటర్ మార్కుల్లో మెరిట్ మార్కులు వచ్చిన వారికి వారు ఎంచుకున్న ఇంజనీరింగ్ విభాగం ఆధారంగా ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తూ వారికి మెరిట్ స్కాలర్ షిప్ ప్రకటించారు. కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థుల మెరిట్ మార్కులు , ర్యాంకులను పరిశీలించి స్కాలర్ షిప్ కింద వారి ఫీజుల్లో మినహాయింపు ఇస్తామని చెప్పారు. కౌన్సిలింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థులకు , తల్లి తండ్రులకు రవాణా సౌకర్యంతో సహా , ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా అమలుచేస్తున్నట్లు స్పష్టం చేశారు.
యూనివర్సిటీ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ J.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 40 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాసారని, ఈ ఏడాది మెరిట్ విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, అత్యంత విలువైన స్కాలర్ షిప్ విధానాన్నీ సిద్ధం చేసినట్లు చెప్పారు.పరీక్ష ఫలితాలతో పాటు , కౌన్సిలింగ్ షెడ్యూల్ , కోర్సుల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్ లో ఉంచామన్నారు.