ఏపీ డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన పివి సింధు
టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ను మర్యాదపూర్వకంగా కలిసింది .మన రాష్ట్రానికి చెందిన సింధు ప్రపంచ స్థాయిలో పతకం సాధించడం ఆంధ్రప్రదేశ్ కు దక్కిన గౌరవమని గౌతం సవాంగ్ అన్నారు.
పీవీ సింధు సాధించిన విజయం మహిళలకు ,యువతకు ప్రేరణ స్పూర్తిని అందిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి దేశం, రాష్ట్ర యొక్క కీర్తిప్రతిష్టలు ఇనుమడింప జేయాలని డీజీపీ ఆకాంక్షించారు.
పివి.సింధు, తల్లిదండ్రులను డీజీపీ శాలువాతో సత్కరించారు. ఎపి ప్రభుత్వం, పోలీస్ శాఖ మహిళల కోసం చేస్తున్న కృషిని అభినందనీయమని పి వి.సింధు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి మహిళ దిశ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలని పివి సింధు కోరారు.