ఆటోని షి టాయిలెట్ గా మార్చిన మహిళ

సంచార టాయిలెట్స్ ను చూశాం. అయితే వినూత్నంగా ఆలోచించిన ఓ మహిళ పాత ఆటోని టాయిలెట్ గా మార్చారు. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ షి ఈ టాయిలెట్ పేరుతో ఆటోలో క్లీన్ టాయిలెట్ ఏర్పాటు చేసి నగరవీధుల్లో తిరుగుతున్నాయి.

ప్రపంచంలోనే మొదటిసారిగా తయారైన ఈ ఆటో టాయ్ లెట్ ఆటో విశేషాలు ఏంటో తెలుసుకుందాం

సుష్మ కల్లెంపూడి అనే మహిళ.. 2017లో అమెరికా నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. హైదరాబాద్ లో మహిళలు బయటకు వెళ్లినప్పుడు టాయ్ లెట్ కోసం ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నూతన ఆవిష్కరణ చేసింది. ఓ ఆటోను మొబైల్ షీ టాయ్ లెట్ గా మార్చింది.

ఈ ఆటోను జీహెచ్ఎంసీ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చూపించింది. మొబైల్ షీ టాయిలెట్ రద్దీ ప్రాంతాల్లో మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని.. పర్యావరణ హితంగా పని చేస్తాయని ప్రభుత్వాలు సైతం గుర్తించాయి . ఇలాంటి ఆటోలను మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని ప్రభుత్వం హామి ఇచ్చింది. హైదరాబాద్ లో ప్రస్తుతం 25 టాయిలెట్ ఆటోలు వీధుల్లో తిరుగుతున్నాయి.

ఒక్కో ఆటో తయారీకి 4 లక్షల రూపాయలు ఖర్చవుతుందని సుష్మ తెలిపారు.

మొబైల్ షీ ఆటోలో 100 లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్, అద్దం, హ్యాంగర్, వాష్ బేసిన్, ఫ్లష్ , డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. అదే విధంగా చంటి పిల్లలకు డైపర్స్ మార్చుకోవటానికి అనువుగా స్థలం ఉంది. మహిళలకు అత్యవసరంగా కావాల్సిన శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా లభిస్తాయని సుష్మ తెలిపింది. ఈ ఆటోలో శానిటరీ న్యాప్కిన్స్ , సెల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్ అందుబాటులో ఉంచామన్నారు . ప్రతి ఆటోకు జీపీఎస్ కనెక్టెవిటీ ఏర్పాటు చేశామని సుష్మ తెలిపారు.

పాత ఆటోలను కొనుగోలు చేసి ఆటో టాయిలెట్ గా మార్చటం జరిగిందని.. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందంటున్నారు సృష్టి కర్త సుష్మ. స్వచ్ఛభారత్ తో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం అందిస్తే.. వందలాది వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆమె వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *