అహర్నిశలు శ్రమిస్తూ సేవలు అందిస్తున్న వైద్యులు కదిలే దేవుళ్ళు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

కరోనా మహమ్మారిపై పోరాటం చేసిన వైద్యులను సన్మానించుకోవడం మన సాంప్రదాయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. రంగారెడ్డిజిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పెట్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్య దినోత్సవం ను పురస్కరించుకుని వైద్యులు ,సిబ్బందిని ఘనంగా సన్మానించారు .అనంతరం జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది డాక్టర్ డే చాలా ప్రత్యేకమైనదని…ఎందుకంటే చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రతికూల పరిస్థితుల్లో సైతం తమ ప్రాణాలను లెక్క చేయకుండా వైద్యులు, వైద్య సిబ్బంది మనకు సేవలు అందిస్తున్నారని అన్నారు. కనిపించని వైరస్‌తో పోరాడుతూ ప్రజలకు ప్రాణదానం చేశారని… లాక్‌డౌన్ నుంచి అన్‌లాక్‌తో మనకైతే ఉపశమనం లభించిందేమో, కానీ వైద్యులకు మాత్రం పని భారం పెరిగిపోయిందన్నారు. రోజు రోజుకు వందల సంఖ్యలో నమోదవుతున్న కేసులను పరిష్కరించేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు అని అన్నారు. ఈ నేపథ్యంలో వైద్యులను తప్పకుండా గౌరవించాలని …. వారి సేవలను ఎన్నటికీ మరిచిపోకూడదన్నారు. మనం కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వైద్యులపై భారాన్ని తగ్గించాలన్నారు .వైద్యులు కరోనాతో మీరు ప్రత్యక్షంగా పోరాడుతున్నారని … బాధితులను రక్షించేందుకు శ్రమిస్తున్నారు అని ఆయన అన్నారు.ఒత్తిడిలో సైతం మీ ప్రాణాలను అడ్డుపెట్టి రోగులను రక్షిస్తు్న్నారు . కరోనా ఆపత్కాలంలో అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు తమ అమూల్యమైన సేవలు అందిస్తున్న డాక్టర్లందరికీ పేరుపేరునా జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు వినయ్ నాగమణి , వైద్య సిబ్బంది రాజశేఖర్, కవిత ,పండరీ రెడ్డి, సంతోష్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు,సీనియర్ నాయకులు కోటేశ్వరరావు, శ్రీనివాస్ యాదవ్, లక్ష్మణ్,రాజా రత్నం మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *