అంతరాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించిన తెలంగాణ ఏపీఎస్ ఆర్టీసీ
అంతరాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించిన తెలంగాణ ఏపీఎస్ ఆర్టీసీ.
లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ అధికారులు అంతరాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు . తెలంగాణ లో పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తేయడంతో ఇతర రాష్ట్ర లకు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు . ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు 6 ఏపీ లో లాక్డౌన్ సడలింపు ఉన్న నేపథ్యంలో ఆ సమయంలోపు ఏపీకు వెళ్ళడం.. తిరిగి తెలంగాణ బార్డర్ కు వచ్చేలా ప్లానింగ్ సిద్దం చేశారు అధికారులు వీలైనన్ని ఎక్కువ సర్వీసులు నడిపించాలని నిర్ణయం తీసుకున్నారు . గతంలో చేసుకున్న ఒప్పందాల మేరకు ఏపీలో అన్ని ప్రాంతాలకు సర్వీసులు తిప్పాలని నిర్ణయం తీసుకున్నారు .ఏప్రిల్ లాక్డౌన్ తర్వాత తెలంగాణ నుంచి ఏపీ కి సర్వీసులు నిలిచిపోయాయి. పొరుగు రాష్ట్రాలలో లాక్డౌన్ నిబంధనల కు అనుగుణంగా ఆర్టీసీ సేవలు అందించాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు